BALU TV:చెడు రసయనాల పరిశ్రమలను పల్లెల్లో పెట్టొద్దు
కోళ్ల పరిశ్రమల ద్వార ప్రజల జీవనం అస్తవ్యస్తం
పచ్చని పల్లెలలపై చేడు కాలుష్యం వెదజల్లే ప్రైవేట్ పార్మా కంపెనీలు,కోళ్ల పరిశ్రమలు రొండు పంటలు పండే వ్యవసాయం బూములలో అక్రమంగా వ్యాపార దృక్పథం తో గ్రామీణ ప్రాంతాల జీవితాలతో చెలగాటమాడుతున్నారని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రినివాస్ గౌడ్ అన్నారు.
నేడు మునుగోడు మండలం కోతులారం గ్రామం లో గ్రామ నివాసాల పక్కనే ఏర్పాటు చేయదలిచిన కోళ్ల పరిశ్రమ పై గ్రామ స్పెషల్ అధికారి విజయ బాస్కర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా కోళ్ల పరిశ్రమ అనుమతులపై గ్రామ ప్రజల అభిప్రాలయం లను సేకరించారు
ఇందులో పాల్గొన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్వ్యర్యంలోని గ్రామ ప్రజలు చేడు వాసనలు వెదజల్లే కోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని, కొద్ది మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దని గ్రామ ప్రజలు ముక్త కంఠంతొ వ్యతిరేకించారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వ అధికారులు వ్యహరించాలని, ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు
కోతులరం లోనే కాదు మునుగోడు నియోజకవర్గం లో ఎక్కడ విషాన్ని వెదజల్లే పార్మ కంపెనీలూ కానీ, కోళ్ల పరిశ్రమలు పెట్టిన తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని పేదల ప్రాణాలతో చెలగాట మాడే ప్రైవేట్ వ్యాపారుల అగాడాలను సహించబోమన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా విష రసాయనాలు వెదజల్లే పరిశ్రములకు అనుమతులు ఇవ్వొద్దని ఆయన డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వట్టికోటి శేఖర్, గ్రామ కార్యదర్శి బాబు, మాజీ సర్పంచ్లు జాజుల పారిజాత సత్యనారాయణ, జక్కలి లోకేష్, జాజుల వెంకటేష్,పందుల అంజయ్య, వట్టికోటి వెంకటేష్, గురిజా నర్సింహ గౌడ్, జాల బచ్చి ప్రసాద్ యాదవ్ ,కందుల ప్రభాకర్, పందుల నరసింహ, కందుల రాజు, జాజుల రామకాంత్, ఏపూరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు